Karnataka: దారుణం..యువకుడి చేత మూత్రం తిగించిన పోలీస్ అధికారి, తప్పు ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు, కర్ణాటకలో చిక్కమగళూరులో ఘటన, ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించిన చిక్కమగళూరు పోలీసు సూపరింటెండెంట్
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు తాలూకా మూడిగెరెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి హేయంగా (Dalit Man's Allegations) ప్రవర్తించాడు. మే 10 న జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Bengaluru, May 23: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు తాలూకా మూడిగెరెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు అండగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి హేయంగా (Dalit Man's Allegations) ప్రవర్తించాడు. మే 10 న జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య గొడవ కేసులో గొణిబీడు ఎస్ఐ అర్జున్.. దళిత వర్గానికి చెందిన పునిత్ అనే యువకున్ని స్టేషన్కు పిలిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి నేరం ఒప్పుకోవాలని బలవంతం చేశాడు. అసభ్య పదజాలంతో తిడుతూ, తాగడానికి నీళ్లు అడిగితే కోపంగా జైళ్లో ఉన్న మరో వ్యక్తి మూత్రం (orced to Drink Urine in Custody) తాగించాడు. అనంతరం 6 గంటలపాటు చిత్రహింసలు పెట్టి విడిచిపెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎస్ఐ పనులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ ఘటపై విచారణకు ఆదేశించారు. సదరు ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
కాగా దొంగతనం కేసులో అరెస్టయిన చేతన్ మొదట్లో తనపై మూత్ర విసర్జన చేయడానికి నిరాకరించాడని, అయితే అతను దానిని పాటించకపోతే హింసకు గురవుతావని ఆరోపించాడని కన్నడ వార్తా సంస్థ తెలిపింది. పోలీసు అధికారులు తనను నేలమీద ఉన్న మూత్ర చుక్కలను నాకేలా చేశారని నిందితుడు ఆరోపించారు. పోలీసులు అతన్నితప్పుడు ఒప్పుకోవాలని బలవంతం చేశారని ఆరోపించారు. తనపై అధికారిక ఫిర్యాదు లేనందున తాను అవమానంగా భావించానని పునిత్ చెప్పాడు. కాగా మే 10 రాత్రి 10.30 గంటలకు అతన్ని పోలీసులు విడుదల చేశారు.
Here's Update
#ArrestPSIArjun #JusticeForPunith https://t.co/ZiFpq6C4p9
— Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 22, 2021
ఈ ఘటనపై ప్రాథమిక విచారణకు (Karnataka Police Order Probe) చిక్కమగళూరు పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ హకే ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఎస్పీ సిడ్ సబ్ ఇన్స్పెక్టర్ను పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేసినట్లు వార్తా పత్రిక ది హిందూ తెలిపింది. అయితే, తదుపరి చర్యలు డిపార్ట్మెంటల్ విచారణలో ఉన్నాయి. రచయిత, ఫ్రీలాన్స్ కాలమిస్ట్ రఘోతమ హోబా ఈ సంఘటన గురించి ట్వీట్ చేశారు. అతని ట్వీట్ను నటుడు చేతన్ కుమార్తో సహా #JusticeforPunith మరియు #ArrestPSIArjun అనే హ్యాష్ట్యాగ్లతో పంచుకున్నారు.
(The above story first appeared on LatestLY on May 23, 2021 04:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

