Pune: పానీపూరి తెచ్చిన భర్త, నన్ను అడక్కుండా ఎందుకు తెచ్చావని భార్య ఆత్మహత్య, పుణేలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Representational Image (Photo Credits: ANI)

Pune, Sep 1: పూణేలో ఒక మహిళ తన భర్తతో గొడవ పడి (Upset with husband) తనువు చాలించింది. దీనికి కారణం తన భర్త తన పర్మిషన్ లేకుండా తినడానికి పానీపూరి తెచ్చాడనే ( buying Pani Puri for dinner) ఒకే ఒక రీజన్. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...షోలాపూర్‌కు చెందిన ఘహినినాథ్ అంబదాస్ 2019లో సరవాదే అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణే లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు.

కాగా వివాహమైనప్పటి నుంచి ఘహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాల విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడగకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు సరవాదేకు కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

స్విగ్గీ ఆర్డర్ లేట్, తాగిన మత్తులో రెస్టారెంట్ యజమానిని కాల్చేసిన డెలివ‌రీ ఏజెంట్‌, గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన, డెలివ‌రీ ఏజెంట్ కోసం గాలిస్తున్న పోలీసులు

ఈ క్రమంలో మరుసటి రోజు భార్య విషం తాగి ఆత్మహత్యకు (woman ends her life) పాల్పడింది. సరవాదే తండ్రి ప్రకాష్.. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త ఘహినీనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూణేలో జాబ్ ఇష్టం లేదని పాత చోటుకే వెళదామని నా భార్య  నాతో నిరంతరం గొడవపడేదని భాదిత భర్త ఆరోపిస్తున్నారు.