Noida Schools Shut: శనివారం వరకు స్కూళ్లు బంద్, చలిగాలుల తీవ్రతతో ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో సెలవులు, కనిష్టానికి పడిపోయిన టెంపరేచర్స్
శీతాకాల పరిస్థితుల కారణంగా I నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. వారణాసి జిల్లా యంత్రాంగం కూడా జనవరి 6 వరకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
New Delhi, JAN 03: ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు (Cold Wave) వణికిస్తున్నాయి. ఢిల్లీలో (Delhi Cold Wave) దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 6-9 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. పంజాబ్ (Punjab), హర్యానా (Haryana) వంటి ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 5వతేదీ వరకు చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా, గ్రేటర్ నోయిడా జిల్లాలో తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల (Cold Wave) కారణంగా జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని సర్కారు ఆదేశించింది. జనవరి 2 నుంచి 5 వరకు పంజాబ్,హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని జిల్లా యంత్రాంగం కూడా కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా I నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం జనవరి 6 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. వారణాసి జిల్లా యంత్రాంగం కూడా జనవరి 6 వరకు 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను (Schools Bundh) మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
జనవరి 5-11 మధ్య, రాత్రి ఉష్ణోగ్రత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాలలో చలి గాలులు వీస్తాయని మహాపాత్ర తెలిపారు. నిరుపేదలకు, నైట్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు అధికార యంత్రాంగాన్ని కోరారు.
(The above story first appeared on LatestLY on Jan 03, 2024 09:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

