Fuel Prices Hiked: మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు, వారంలో నాలుగోసారి పెరిగిన ధరలు, ఐదురోజుల్లో పెట్రోల్‌పై రూ.3.20 పెంపు, ఏయే నగరాల్లో ఎంత పెరిగిందో తెలుసా?

సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ సంస్థలు (Oil Companies). ఈ వారంలో నాలుగోసారి ఇంధన ధరలు (Fuel Prices) పెరిగాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు 90 పైసలు పెంచాయి. దీంతో తెలంగాణలో (Telangana) పెట్రోల్ పై 89, డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 111.80, డీజిల్ 98.10 పెరిగాయి.

Fuel Prices Hiked: మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు, వారంలో నాలుగోసారి పెరిగిన ధరలు, ఐదురోజుల్లో పెట్రోల్‌పై రూ.3.20 పెంపు, ఏయే నగరాల్లో ఎంత పెరిగిందో తెలుసా?
Road Development Cess In AP | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, March 26: సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చాయి ఆయిల్ సంస్థలు (Oil Companies). ఈ వారంలో నాలుగోసారి ఇంధన ధరలు (Fuel Prices) పెరిగాయి. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ లీటరుకు 90 పైసలు పెంచాయి. దీంతో తెలంగాణలో (Telangana) పెట్రోల్ పై 89, డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 111.80, డీజిల్ 98.10 పెరిగాయి. ఏపీలో పెట్రోల్ పై 86, డీజిల్ పై 80 పైసలు పెరిగాయి. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 113.82,డీజిల్ 99.76కు చేరాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 113.62, డీజిల్ 99.56కు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ పై 80 పైసలు పెరిగాయి. దీంతో హస్తినలో లీటర్ పెట్రోల్ రూ. 98.61 ,డీజిల్ రూ. 89.87కు చేరాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 113.35, డీజిల్ రూ. 97.55కు పెరిగాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది నవంబరు 4 నుంచి ఈ సంవత్సరం మార్చి 21 వరకు చమురు కంపెనీలు ధరలు పెంచలేదు. ఐదు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3.20 పెరిగాయి. మార్చి 22 నుంచి చమురు ధరలు పెరుగుతున్నాయి.

The Kashmir Files: మండుతున్న కాశ్మీర్ ఫైల్స్, సినిమా చూసి వస్తున్న ముగ్గురిపై కత్తి పోట్లు, నిందితులను వెంబడించిన పోలీసులపై కాల్పులు, దమ్ముంటే అరెస్టు చేయండి అంటూ నిందితుల పోలీసులకు సవాల్...

ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 రోజుల్లోనే మళ్లీ ధరలు పెంచడంతో సామాన్యుడికి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచకపోవడంతో I.O.C, B.P.C.L, H.P.C.L కంపెనీలకు 19 వేలకోట్ల రూపాయల నష్టం వచ్చిందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఈ నష్టాలను పూడ్చాలంటే ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

Coronavirus in India: దేశంలో కొత్త‌గా 1,660 మందికి కోవిడ్, కొత్తగా 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపిన వైద్యశాఖ, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌

అటు పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సామాన్యులపైనా, పేదలపైనా మోదీ సర్కారు యుద్ధం చేస్తోందని లోక్‌సభలో విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే ఇంధన ధరలకు కళ్లెంవేసి, సామాన్యుడిపై భారాన్ని తగ్గించాలని కోరాయి.

(The above story first appeared on LatestLY on Mar 26, 2022 11:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).