PM Modi Unveils 108-feet Statue of Hanuman: హనుమాన్ జయంతి సందర్భంగా, గుజరాత్లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్రమోదీ
హనుమాన్ జయంతి సందర్భంగా.. గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వర్చవల్ విధానంలో జరిగింది.
హనుమాన్ జయంతి సందర్భంగా.. గుజరాత్ లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వర్చవల్ విధానంలో జరిగింది. ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
Today, we mark the special occasion of Hanuman Jayanti. In Morbi, at 11 AM, a 108 feet statue of Hanuman ji will be inaugurated. I am honoured to be getting the opportunity to be a part of this programme via video conferencing. https://t.co/qjvLIHWWiO pic.twitter.com/kbHcIxd90Z
— Narendra Modi (@narendramodi) April 16, 2022
"నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. మోర్బిలో ఉదయం 11 గంటలకు 108 అడుగుల హనుమాన్ విగ్రహావిష్కరణ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. హనుమాన్ జీ చార్ ధామ్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా నాలుగు ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో ఇది రెండోది.
(The above story first appeared on LatestLY on Apr 16, 2022 02:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

