DK Shivakumar Meets PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ భేటీ, ఏయే అంశాల‌పై చ‌ర్చించారంటే?

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్‌ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు

DK Shivakumar Meets PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ భేటీ, ఏయే అంశాల‌పై చ‌ర్చించారంటే?
DK Shivakumar Meets PM Modi

New Delhi, July 31: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్‌ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు. ఆ అభ్యర్థనను సానుకూలంగా పరిగణించకపోవడంతో టన్నెల్ ప్రాజెక్ట్, సిగ్నల్ రహిత కారిడార్, ప్రధాన రహదారులు, బెంగుళూరులో తుఫాను నీటి కాలువల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు కోరామని అన్నారు. కాగా, జాతీయ ఖజానాకు అత్యధిక పన్నులు అందజేసే రెండో మహానగరం బెంగళూరు అని డీకే శివకుమార్‌ తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదని విమర్శించారు. అందుకే మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుపై గత బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లు కేటాయించినప్పటికీ కేంద్రం ఎలాంటి నిధులను విడుదల చేయకపోవడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

 

మరోవైపు తమిళనాడుకు నిర్దేశిత నీటి కంటే అదనపు నీటిని జూలైలో విడుదల చేయడంపై ప్రధాని మోదీకి వివరించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. మహాదాయి సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అయితే రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jul 31, 2024 09:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).