Uttar Pradesh Horror: దారుణం, యువకుడిని కిడ్నాప్ చేసి ప్రైవేట్ భాగాలను కోసేసిన 6 మంది ట్రాన్స్జెండర్లు, రక్తం కారుతూ నొప్పితో విలవిలాడుతూ స్టేషన్ కి పరిగెత్తిన బాధితుడు
బాధితుడు తనకు ఎదురైన బాధను వివరిస్తూ.. ‘నా ప్రైవేట్ పార్ట్లలో నుంచి రక్తం వస్తోందని, నాకు చాలా నొప్పిగా ఉంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ ఏకే సింగ్ తెలిపారు.
ముంబయి,మార్చి 21: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ట్రాన్స్జెండర్ల బృందం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని ప్రైవేట్ భాగాలను నరికివేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అలీఘర్ జిల్లాలో ఆరుగురు ట్రాన్స్జెండర్ల బృందం 30 ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసింది. వారు అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించారు. దిగ్భ్రాంతికరమైన గతేడాది సెప్టెంబర్ లో జరగగా ఇప్పుడు మరోసారి వెలుగులోకి వచ్చింది.
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం , బాధితుడు తన ఫిర్యాదులో లింగమార్పిడి బృందం తన ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేయడానికి ముందు తనను మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితి లోకి పంపారని ఆరోపించాడు. అనంతరం ప్రైవేట్ భాగాలను కోసిన ట్రాన్స్జెండర్లు బాధితుడిని చనిపోయాడనుకుని నగరంలోని రోడ్డు పక్కన పడేశారు. అయితే కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన నిందితుడికి తన ప్రైవేట్ పార్ట్లు కోసిన విషయం తెలిసింది. వేరొకరితో అక్రమ సంబంధం అనుమానం, భార్య ప్రైవేట్ పార్టులో కత్తితో పొడిచిన ప్రియుడు, బెంగుళూరులో షాకింగ్ ఘటన
బాధితుడు తనకు ఎదురైన బాధను వివరిస్తూ.. ‘నా ప్రైవేట్ పార్ట్లలో నుంచి రక్తం వస్తోందని, నాకు చాలా నొప్పిగా ఉందని పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని డీఎస్పీ ఏకే సింగ్ తెలిపారు. ఆగస్టు 25న రాంపూర్ నుంచి నరౌకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని బాధితుడు చెప్పాడు. ఢిల్లీలో దారుణం, అర్థరాత్రి యువకుడిని అడ్డగించి ఫ్యాంట్ విప్పి వెనక రాడ్ పెట్టిన కిరాతకులు, ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ..
బొలెరో కారు తనను అడ్డగించి తమ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారని బాధితుడు చెప్పాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా దాడి చేశారు. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను నరికివేసే ముందు విషపూరిత పదార్థం తినిపించి అపస్మారక స్థితికి పంపారని బాధితుడు ఆరోపించాడు.ఆరుగురు నిందితులను చవన్నీ, అనిత, ముస్కాన్, శివం, సిమ్రాన్, గయాదేవిగా గుర్తించారు.
(The above story first appeared on LatestLY on Mar 21, 2024 07:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

