West Bengal shocker: పుట్టింటికి పంపలేదని మామది అది కోసి పడేసిన కోడలు, నిందితురాలిని అరెప్ట్ చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Kolkata, Sep 29: పశ్చిమబెంగాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మైనా జిల్లాలో పుట్టింటికి పంపలేదన్న కోపంతో ఓ మహిళ తన మామ మర్మాంగాలను (Woman crushes father-in-law's testicles) కోసి పడేసింది. ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. మైనా జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు మేదినీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన శిఖా అనే మహిళను చికెన్ కూరతో భోజనం చేసేందుకు రమ్మని ఆమె తండ్రి ఫోన్‌ చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు కాల్‌ చేయగా.. అతడు వెళ్లవద్దని చెప్పాడు. తానే చికెన్‌ తెస్తానని.. ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు.

భార్యపై అనుమానంతో బెడ్ రూంలో కెమెరా, అది తెలియక ప్రియుడితో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆ తరువాత ట్విస్ట్ ఏంటంటే..

దీంతో కోపంతో కాల్‌ కట్‌ చేసిన ఆ మహిళ తన అత్తామామలను తీవ్రంగా దూషించింది. అది కాస్తా వాగ్వాదానికి (dispute) దారితీసింది. దీంతో ఉద్రేకంతో ఊగిపోయిన శిఖా విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసిపడేసింది. అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి మహిళను బంధించారు. ఆమె విడిపించుకుని కన్నవారింటికి పారిపోయింది. నిందితురాల్ని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.