India Post Aircraft: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం, పశ్చిమ బెంగాల్‌‌లో ఘటన, బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు,కోల్‌కతా విమానాశ్రయంలో మూలన పడి ఉన్న డజనుకు పైగా విమానాలు

పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ( DURGAPUR)ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వైనం మంగళవారం వెలుగు చూసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ (India Post Aircraft) కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.

India Post Aircraft: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విమానం, పశ్చిమ బెంగాల్‌‌లో ఘటన, బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు,కోల్‌కతా విమానాశ్రయంలో మూలన పడి ఉన్న డజనుకు పైగా విమానాలు
Truck Carrying Abandoned India Post Aircraft Stuck in West Bengal (Photo Credits: ANI)

Kolkata, December 24: పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ( DURGAPUR)ట్రక్కుపై తరలిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వైనం మంగళవారం వెలుగు చూసింది. భారత తపాలా శాఖకు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ (India Post Aircraft) కొంతకాలం నుంచి నిరూపయోగంగా ఉంది. నేషనల్ హైవే-2 బ్రిడ్జి కింద ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇరుక్కుపోయింది. దీంతో విషయం తెలుసుకున్న తపాలా శాఖ అధికారులు దుర్గాపూర్‌కు చేరుకున్నారు.

ఎయిర్‌క్రాఫ్ట్‌ను బ్రిడ్జి కింద నుంచి బయటకు తీసేందుకు పోలీసులు, అధికారులు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.సోమవారం (డిసెంబర్ 23) రాత్రి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్రిడ్జి కింద ఇరుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

TOI యొక్క నివేదిక ప్రకారం, రిజిస్ట్రేషన్ నంబర్ VT-EGG ఉన్న బోయింగ్ B737 విమానం గత ఐదేళ్ళుగా విమానాశ్రయ మైదానంలో ఉంచబడింది. ఈ విమానం 2014 లో గ్రౌండ్ చేయబడింది. అప్పటి నుండి కోల్‌కతా విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ల్యాన్ ముందు పడి ఉంది. ఇండియా పోస్ట్ ఈ విమానాన్ని కోల్‌కతా రహదారులపై కంటెయినర్ల ద్వారా తీసుకెళ్తున్నప్పుడు జెస్సోర్ రోడ్‌లోని వాహనదారులు ఈ భారీ విమానం చూసి ఆశ్చర్యపోయారని తెలిపింది.

Here's the tweet:

కోల్‌కతా విమానాశ్రయంలో (Kolkata Airport) దాదాపు డజను విమానాలు ఇప్పటికీ పనిలేకుండా ఉన్నాయని TOI నివేదిక పేర్కొంది. ఈ విమానాలన్నీ కాలం చెల్లినవిగా చెత్తలోకి వెళ్లడానికి వేచి ఉన్నాయి. కాగా B737 విమానం పూర్వపు ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినది. దీనిని ఇండియా పోస్ట్ తన జీవితపు ఫాగ్ ఎండ్ వైపు ఉపయోగించిందని TOI తెలిపింది.

(The above story first appeared on LatestLY on Dec 24, 2019 06:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).