NOTA Votes in MCD Election: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు షాకిచ్చిన ఓటర్లు, ఎవరూ నచ్చలేదంటూ నోటాకు గుద్దిన అర లక్ష మందికి పైగా ఓటర్లు
ఢిల్లీలో ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డులకే పరిమితం చేసింది. ఇదిలా ఉంటే గత ఆదివారం జరిగిన పోలింగ్లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి.
- Read in
- తెలుగు
ఢిల్లీలో ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డులకే పరిమితం చేసింది. ఇదిలా ఉంటే గత ఆదివారం జరిగిన పోలింగ్లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి. అంటే తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేశారు. ఢిల్లీలో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. వారిలో 78,93,418 పురుషులు, 66,10,879 మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎంసీడీ ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 (0.78 శాతం) మంది నోటాకు ఓటేశారు.
Here's UPdate
MCD Election Results 2022: 57,545 Votes for NOTA in Delhi Municipal Corporation Polls #MCDResults #MCDElections2022 #DelhiMCDElectionResults2022 https://t.co/eHkfyE2Ky0
— LatestLY (@latestly) December 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 08, 2022 10:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

