IAF Vehicle Attacked in J&K: జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి, భద్రతా బలగాల కాన్వాయ్ పై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు, ఐదుగురు జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు (Terror Attack) ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
Srinagar, May 04: జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఇక్కడి పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు (Terror Attack) ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంతోపాటు మరో దానిపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Indian Air Force vehicle in #Poonch ( Jammu ) 5 injured
Pray for our Soldiers!!#IndianArmy 🇮🇳 #IndianAirForce pic.twitter.com/ME4h629Q70
— SR ⁶⁹ (@ultimate__d) May 4, 2024
ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. గత ఏడాది సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి.
(The above story first appeared on LatestLY on May 04, 2024 09:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

