Andhra Pradesh: వీడియోలు ఇవిగో, విజయవాడ వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్, ఎదురుదాడికి దిగిన వరద బాధితులు, న్యాయం చేయాలని డిమాండ్
బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు లాఠీచార్జి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు
Vjy, Sep 24: బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు లాఠీచార్జి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్ జోన్లో లేదని అధికారులు చెబుతున్నారు.
15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్ వారికి రేషన్ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Here's Videos
విజయవాడ కుమ్మరి పాలెం సెంటర్లో ఉద్రిక్తత
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై లాఠీ చార్ట్ చేసిన పోలీసులు
ఎదురుదాడికి దిగిన వరద బాధితులు
మాకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీ చార్జ్ చేయడం దారుణం అంటున్న బాధితులు
దగ్గరే ఉండి ఏడిసీపీ రామకృష్ణ ఏసీపి… pic.twitter.com/MOHc32uNLg
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2024
విజయవాడ వరద బాధితులు పై పోలీసులు లాఠీ చార్జ్
విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో నష్ట పరిహారం అందలేదని ధర్నా చేపట్టిన వరద బాధితులు.
పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేశారు.
— హేమకుమార్ నండూరు (@HemakumarReddyN) September 23, 2024
విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లో రోడ్డుపై బేటాయించిన వరద బాధితులు
రోడ్డు బ్లాక్ చేసి నిరసన తెలియజేస్తున్న మహిళలు
కలెక్టర్ రావాలని ధర్నా చేస్తున్న వరద బాధితులు
మూడు కిలోమీటర్ల మేరా నిలిచిపోయిన ట్రాఫిక్ pic.twitter.com/q17KAcwrGO
— Narendra Nani (@Narendr23656142) September 23, 2024
వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్ చేశారు.
అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్ తహసిల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు.
కలెక్టర్కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డ్ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
(The above story first appeared on LatestLY on Sep 24, 2024 01:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

