Shraddha Walker Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం, సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ అసలు వాస్తవాలు, యువతిని 35 ముక్కలు చేసిన కేసులో సంచలన నిజాలు..
తాజాగా ఓ సీసీ టీ ఫుటేజీని కూడా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను తరలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే గతంలో దొరికిన గుర్తు తెలియని మృతదేహాలు, శరీర భాగాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కాగా.. తాజాగా ఓ సీసీ టీ ఫుటేజీని కూడా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను తరలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మే 18న ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరం లోనే ఉన్న త్రిలోక్పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్లో కొన్ని గుర్తు తెలియని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రామ్లీలా మైదానానికి సమీపంలో చెత్తకుప్పలో కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మనిషి తలను చేతులను పోలీసులు, ఫోరెన్సిక్ బృందం గుర్తించారు.
#WATCH | Shraddha murder case: CCTV visuals of Aftab carrying bag at a street outside his house surface from October 18 pic.twitter.com/S2JJUippEr
— ANI (@ANI) November 19, 2022
అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్లో భద్రపర్చినట్టు అప్పటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.
(The above story first appeared on LatestLY on Nov 19, 2022 06:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

