Ghaziabad Accident: ఘ‌జియాబాద్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర ప్ర‌మాదం, త‌ల్లీ, కుమారుడు ప్ర‌యాణిస్తున్న స్కూట‌ర్ ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరి కింద‌ప‌డి మృతి

రాంగ్‌ రూట్‌టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు.

Ghaziabad Accident: ఘ‌జియాబాద్ ఎక్స్ ప్రెస్ వేపై ఘోర ప్ర‌మాదం, త‌ల్లీ, కుమారుడు ప్ర‌యాణిస్తున్న స్కూట‌ర్ ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరి కింద‌ప‌డి మృతి
Ghaziabad accident

Ghaziabad, July 22: ఎక్స్‌ప్రెస్‌ హైవేపై స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ప్రయాణించిన తల్లీకొడుకు గాల్లోకి ఎగిరిపడ్డారు. (Mother-son flung into air) తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో (Ghaziabad) ఈ సంఘటన జరిగింది.

 

జూలై 20న రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై తల్లీ, కుమారుడు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రాంగ్‌ రూట్‌టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు. ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

(The above story first appeared on LatestLY on Jul 22, 2024 10:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).