Earthquake in Andaman Sea: భూ ప్రకంపనలతో వణిపోయిన అండమాన్ తీరం‌, మణిపూర్‌

భూ ప్రకంపనలతో అండమాన్‌ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్‌ ప్రాంతం వణికిపోయాయి. మంగళవారం వేకుమజామున 3.39 గంటలకు అండమాన్‌ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది.

Earthquake in Andaman Sea: భూ ప్రకంపనలతో వణిపోయిన అండమాన్ తీరం‌, మణిపూర్‌
Credits: X

Newdelhi, Sep 12: భూ ప్రకంపనలతో అండమాన్‌ (Andaman) దీవులు, మణిపూర్‌లోని (Manipur) ఉక్రుల్‌ ప్రాంతం వణికిపోయాయి. మంగళవారం వేకుమజామున 3.39 గంటలకు అండమాన్‌ సముద్ర తీరంలో (Andaman Sea) భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 93 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. సోమవారం వేకువజామున 4.4 తీవ్రతతో బంగాళాఖాతం (Bay of Bengal) తీరంలో భూమి కంపించిందని పేర్కొంది.

Rail Coach Restaurant: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 'రైల్ కోచ్ రెస్టారెంట్'... దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యాచరణ.. బోగీలో వివిధ రకాల వంటకాలతో వినియోగదారులకు సేవలు

మణిపూర్‌లోనూ..

ఇక సోమవారం రాత్రి 11.1 గంటలకు మణిపూర్‌లోని ఉఖ్రుల్‌ (Ukhrul) జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 5.1గా నమోదయిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

(The above story first appeared on LatestLY on Sep 12, 2023 10:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).