Nipah Virus: డేంజర్ బెల్స్.. కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం.. కేరళలో రెండు అసహజ మరణాలు.. నీపా వైరస్ కారణమని అనుమానాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
కరోనా విలయం పూర్తయిందో లేదో.. మరో భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలోని కోజీకోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Newdelhi, Sep 12: కరోనా (Corona) విలయం పూర్తయిందో లేదో.. మరో భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేరళలోని (Kerala) కోజీకోడ్ (Kozhikodes) జిల్లాలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీపా వైరస్ (Nipah Virus) కారణంగా బాధితులు మరణించారన్న అనుమానాల నడుమ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం పేర్కొంది. మృతుల బంధువు ఒకరు అనారోగ్యం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కూడా వెల్లడించింది. దక్షిణ భారతంలో తొలి నిపా వైరస్ కేసు 2018లో కోజీకోడ్ జిల్లాలోనే బయటపడటం తెలిసిందే.
The Kerala Health Department on Monday issued a health alert in Kozhikode district after two deaths were suspected to be caused by the Nipah virus infection, which was described as “unnatural."https://t.co/yAmuc6icRB
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) September 12, 2023
ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుంది అంటే?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్ఫెక్షన్ బారిన పడతారు. నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు.
Asia Cup India vs Pakistan: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, 228 పరుగుల తేడాతో పాక్పై భారత్ గెలుపు..
(The above story first appeared on LatestLY on Sep 12, 2023 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

