UP Shocker: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...18 మంది దుర్మరణం... పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సును మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొంది.

UP Shocker: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం...18 మంది దుర్మరణం... పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సు
IMAGE: PTI

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. బుధవారం వేకువజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్ నుండి ఢిల్లీ వైపు వెళ్తున్న స్లీపర్ బస్సును మిల్క్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో సుమారు 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్‌ మౌ ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 05:15 గంటలకు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ బయటకు తీసి చికిత్స నిమిత్తం సిహెచ్‌సి తరలించి మృతదేహాలను స్వాధీనం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 10, 2024 09:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).