దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ లో జరిగే ఫార్ములా ఈ- ప్రిక్స్ రేసింగ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.దీనికి ప్రధాన కారణం ఆనంద్ మహీంద్రా జట్టు మహీంద్రా రేసింగ్ ఈ పోటీల్లో పాల్గొనడమే. ప్రపంచమంతా పోటీ పడి వచ్చిన మహీంద్రా రేసింగ్ జట్టు.. చివరికి సొంత గడ్డపై పోటీల్లో పాల్గొనడం పట్ల తాను ఎంతో ఉత్సాహంతో ఉన్నట్టు ఆనంద్ మహీంద్రా ప్రకటించారు.

ఫార్ములా- ఈ రేసింగ్ ని..ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ గా పిలుస్తుంటారు. ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ల పోటీ ఇది. ఒకే సీటర్ వాహనాల మధ్య పోటీ ఉంటుంది. ఎఫ్ఐఏ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లోని నెక్లస్ రోడ్డులో గ్రీన్కో హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. ఈ నెల 11వ తేదీన మొదలు కానున్నాయి.

11 జట్లు ప్రపంచం నలుమూలల నుంచి ఈ పోటీలకు తరలివస్తున్నాయి.ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల ప్రపంచవ్యాప్త రేసింగ్ తర్వాత అంతిమంగా మాతృదేశంలో రేసింగ్ లో పాల్గొంటున్నాం. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ మొదటిసారి భారత్ కు వస్తోంది. కేటీఆర్ బీఆర్ఎస్ కు, గ్రీన్కోకు ఈ విషయంలో ధన్యవాదాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Here's Mahindra Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)