నందమూరి నటసింహం బాలకృష్ణ 'అఖండ' సినిమాతో బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసారు. ఇక క్రాక్‌ సినిమాతో హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేనితో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాను #NBK107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. గోపిచంద్‌ మలినేని మాస్‌ డైరెక్టర్‌, బాలకృష్ణ మాస్‌ హీరో. మరీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో విలన్‌ ఎవరా అనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది.

అందుకే ఈ సినిమాలో విలన్‌ పాత్రకు ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డైరెక్టర్‌ గోపిచంద్‌ ప్రకటించారు. 'వేరీ హ్యాపీ టు వెల్‌కమ్‌ ది సాండల్‌వుడ్‌ సెన్సేషన్‌ దినియా విజయ్‌. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.' అంటూ ట్వీట్‌ చేశారు. ఇందులో హీరో విలన్ల మధ్య సీన్లు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్‌ బుర్ర డైలాగ్స్‌ రాయగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించగా ఈ నెల నుంచి సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)