Video: వీడియో ఇదిగో, మలేషియా ప్రధానితో భేటీ అయిన రజినీకాంత్, అందుకోసమే కలిసానని చెప్పుకొచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్
రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు.
రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు. తన ఎక్స్లో (ట్విటర్) ఈ ఫొటోలను షేర్ చేసిన అన్వర్ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇక 2017లోనూ రజనీకాంత్ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్ అంబాసిడర్ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజనీ.. ‘కబాలి’ షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయన ఆహ్వానించినట్లు తెలిపారు.

Here's Video
Define MASS.
Prime minister of Malaysia greets Superstar #Rajinikanth.
||#Thalaivar171||pic.twitter.com/1iAaNYhvTr
— Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 11, 2023 08:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

