ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆప్‌ శాసనసభా పక్ష నేతగా మంత్రి అతిశీని ఎన్నుకున్నట్లు ఎల్జీకి కేజ్రీ తెలిపారు.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం ఆయన తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.ఇవాళ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ, ప్రతిపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)