నిన్నటివరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్‌పై భారీగా వడ్డించాయి. తాజాగా పెంచిన ధరలతో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. దీంతో ఇది రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)