దేశ రాజధానిలో కరోనావైరస్‌, కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచనల మేరకు వారాంతపు కర్ఫ్యూ విధింస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో విధించే కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో గత 24 గంటల్లో 5,481 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, మే 16 నుండి అత్యధికం ఇవే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)