Jammu and Kashmir: వీడియో ఇదే, ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భారత సైన్యం, అక్రమంగా భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం

భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఈ ముగ్గురిపాకిస్థాన్‌ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.

Jammu and Kashmir: వీడియో ఇదే, ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భారత సైన్యం, అక్రమంగా భారత్‌లోకి చొచ్చుకువచ్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం
Representational Image (Photo Credits: PTI)

భారత్ లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముగ్గురు తీవ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో (Uri sector) నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఈ ముగ్గురిపాకిస్థాన్‌ ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. గురువారం ఉదయం బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ నిర్వహిస్తుండగా నియంత్రిణ రేఖ వెంబడి ముగ్గురు వ్యక్తులు తుఫాకులతో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే భారత భూభాగంలోకి చొరబడుతున్నారని గుర్తించిన భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపింది.

దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కశ్మీర్‌జోన్‌ పోలీసులు తెలిపారు.అనంతరం ఆ ప్రాంతంలో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశామని, ఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు, ఒక చైనీస్‌ ఎం 16 తుపాకీ, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ వీడియోను ఇండియన్‌ ఆర్మీ తాజాగా విడుదల చేసింది.

Watch Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 26, 2022 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).