Tamil Nadu Extends Lockdown: జూన్ 28 వరకు లాక్డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం, ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్డౌన్ను కొన్ని సడలింపులతో జూన్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న లాక్డౌన్ను కొన్ని సడలింపులతో జూన్ 28 వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 21 ఉదయం 6 గంటలతో ముగియవలసి ఉంది. ప్రస్తుతం అనుమతించదగిన కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవవచ్చునని పేర్కొంది.
ఇంటర్ సిటీ బస్ ట్రాన్స్పోర్ట్ను చెన్నై సహా నాలుగు జిల్లాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపవచ్చునని తెలిపింది. మెట్రో రైలు సేవలు కూడా 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఈ-రిజిస్ట్రేషన్ లేకుండా ఆటోరిక్షాలు, రెంటల్ క్యాబ్లను నడపవచ్చునని పేర్కొంది.
Lockdown in Tamil Nadu extended for one more week, till June 28th, with further relaxations.
— ANI (@ANI) June 20, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 20, 2021 02:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

