దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరేల్‌ ప్రాంతంలో గల కర్రీ రోడ్డులోని అవిఘ్న పార్క్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే 12 ఫైర్‌ ఇంజన్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)