బాలాసోర్‌ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్‌పూర్‌-కోయింజర్‌ స్టేషన్‌కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్‌ రైల్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వర్షం వస్తుందని గూడ్స్ రైలు కింద తల దాచుకుందామని కార్మికులు వెళ్లారు.

అయితే ఈదురుగాలులకు గూడ్స్ రైలు కదలడంతో చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు చనిపోగా ముగ్గురికి కాళ్ళు చేతులు విరిగాయి. ఇదిలా ఉండగా, బుధవారం అస్సాంలోని బోకోకు సమీపంలో బొగ్గును తరలిస్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఎల్పీజీ గ్యాస్‌ అన్‌లోడింగ్‌కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గూడ్స్‌ రైల్‌ బోగీలు పట్టాలు తప్పాయి.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)