Udaipur beheading: ఇస్లాంను ఆ ఉన్మాదులు చదివుంటే ఈ ఘాతుకానికి పాల్పడే వారు కాదు, తల నరికివేత ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపిన ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిరాతకంగా చంపడాన్ని షాహీ ఇమామ్ ఖండించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇవాళ ప్రకటన రిలీజ్ చేశారు. తల నరికివేత ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
- Read in
- తెలుగు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ను ఇద్దరు ముస్లిం వ్యక్తులు కిరాతకంగా చంపడాన్ని షాహీ ఇమామ్ ఖండించారు. ఈ హత్యా ఘటనకు సంబంధించి ఢిల్లీలోని జామా మసీదుకు చెందిన షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇవాళ ప్రకటన రిలీజ్ చేశారు. తల నరికివేత ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అది పిరికిపంద చర్య అని, ఇస్లామ్కు వ్యతిరేకమని ఆయన తన ప్రకటనలో తెలిపారు. గుండె పగిలేలా ఉన్న ఉదయ్పూర్ ఘటన యావత్ మానవాళిని కలిచివేసిందన్నారు.
భారతీయ ముస్లింల తరపున ఆ ఘటనను ఖండిస్తున్నట్లు షాహీ ఇమామ్ తెలిపారు.ఇస్లాం మతం శాంతికి, సౌభాతృత్వానికి చిహ్నమన్నారు. ప్రేమ, సహనం, ఔదార్యం, మానవత్వానికి మహమ్మద్ ప్రవక్త జీవితం నిదర్శనం అన్నారు. ప్రవక్త జీవితాన్ని కానీ, పవిత్ర ఖురాన్ను కానీ, షరియత్ను కానీ ఒకవేళ ఆ ఉన్మాదులు చదివి ఉంటే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండేవారు కాదని షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ తన ప్రకటనలో తెలిపారు.
Shahi Imam of Jama Masjid, Delhi issues a statement on the Udaipur beheading incident; condemning the act, he calls it "not only an act of cowardice but an act against Islam." pic.twitter.com/UVVpvqYM4h
— ANI (@ANI) June 29, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 29, 2022 03:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

