Uttar Pradesh: యూపీలో దారుణం, మొబైల్ టార్చిలైట్లతో పేషెంట్కి చికిత్స అందించిన వైద్యులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా ఆసుపత్రిలో పవర్ కట్ కావడంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా ఆసుపత్రిలో పవర్ కట్ కావడంతో వైద్యులు తమ మొబైల్ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సంఘటనపై బల్లియా జిల్లా ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ ఆర్డీ రామ్ సోమవారం వివరణ ఇచ్చారు. పవర్ కట్ వల్ల డాక్టర్లు, రోగులు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఇబ్బంది పడినట్లు తెలిపారు. గతంలో జెనరేటర్ బ్యాటరీలు చోరీ కావడంతో వీటిని విడిగా ఉంచినట్లు చెప్పారు. దీంతో బ్యాటరీలను సెట్ చేసి జెనరేటర్ ఆన్ చేసేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకు స్పందించలేదు.
RD Ram, CMS incharge at the hospital says there was a delay in installing batteries of the generator. The batteries are kept elsewhere to ensure it is not stolen by miscreants. pic.twitter.com/YzQUnHfCpt
— Piyush Rai (@Benarasiyaa) September 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 12, 2022 04:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

