MP Ganeshamurthi Passes Away: లోక్ సభ ఎన్నికల టిక్కెట్టు రాలేదని తమిళనాడు ఎంపీ ఎ. గణేశమూర్తి మనస్తాపం.. ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నేడు మృతి
తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత ఎ.గణేశమూర్తి గురువారం కోయంబత్తూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
Chennai, Mar 28: తమిళనాడులోని (Tamilnadu) ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత ఎ.గణేశమూర్తి (MP Ganeshamurthi Passes Away) గురువారం కోయంబత్తూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. తీవ్ర అనారోగ్యం పాలైన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో కోయంబత్తూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో కార్యకర్తలు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.
Tamil Nadu MDMK MP Ganeshamurthi dies of cardiac arrest after suspected suicide attempt#Ganeshamurthi #TamilNadu #MDMK #ErodeMP #Erode #cardiacarresthttps://t.co/kA8qi9UMGW
— IndiaTV English (@indiatv) March 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 28, 2024 10:01 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

