బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్‌ గెహ్లాట్‌ ను బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (AICC) సీనియర్‌ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన నాయకుడు రాహుల్‌ గాంధీతో సంప్రతించిన తరువాత తేజస్వి యాదవ్‌ను ప్రతిపక్ష కూటమి తరఫు సీఎం అభ్యర్థిగా నిర్ణయించామని తెలిపారు. అలాగే, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (VIP) అధ్యక్షుడు ముఖేశ్‌ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నవంబర్‌ 6, 11 తేదీల్లో జరుగనుందని, ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న జరగనున్నదని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ కూటమిల మధ్య జరుగుతుందన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, అధికార ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజల ఆదరణ తగ్గని పరిస్థితిని విమర్శించారు.ఏన్డీయే పాలన ప్రజాస్వామ్యానికి హానికరంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీయే సర్కార్‌ విధానాల కారణంగా నిరుద్యోగం పెరిగిందని, ప్రజలు విసిగిపోయారని, మార్పు కోరుతున్నారని గెహ్లాట్‌ తెలిపారు.

 Tejashwi Yadav Named Mahagathbandhan’s Chief Ministerial Candidate

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)