UP Horror: ఉచితంగా చికెన్ ఇవ్వలేదని.. దళితుడిని చెప్పులతో చావగొట్టారు.. యూపీలోని లలిత్ పూర్ జిల్లాలో దారుణఘటన
ఉత్తరప్రదేశ్ లోని లలిత్పూర్ జిల్లాలో మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lucknow, Aug 13: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని లలిత్పూర్ జిల్లాలో (Lalitpur) మరో దళితుడు దాడికి గురయ్యాడు. ఉచితంగా చికెన్ (Chicken) ఇచ్చేందుకు నిరాకరించిన వ్యక్తిని రోడ్డుపైనే చెప్పులతో చావగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో (Video) సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వార్ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్పై తిరుగుతూ గ్రామాల్లో చికెన్ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో రెచ్చిపోయారు. అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడిచేశారు. వదిలేయాలని ప్రాధేయ పడుతున్నా కనకరం లేకుండా విచక్షణ రహితంగా దాడిచేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
It is said that the victim, Sujan Ahirwar, was beaten by men who were allegedly in a drunken state and refused to pay him for the chicken. #UttarPradesh https://t.co/dCc7RVXTQJ
— IndiaToday (@IndiaToday) August 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 13, 2023 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

