DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?
వచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.
Hyderabad, Feb 3: వచ్చే నెలలోగా హైదరాబాద్ (Hyderabad), విజయవాడతో (Vijayawada) పాటు కోల్ కతా (Kolkata), పుణె (Pune) విమానాశ్రయాల్లో డిజీ యాత్ర (DigiYatra) సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఇటీవల పలు విమానాశ్రయాల్లో చెక్ ఇన్ కోసం వందలాది మంది గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. దీంతో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది. ప్రయాణికుల స్మార్ట్ ఫోన్ లోనే వారి వివరాలు, ప్రయాణ డీటేయిల్స్ తదితరాలను పర్సనల్లీ ఐడెంటిఫేబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) గా నమోదు చేస్తారు. దీనికోసం డిజీ యాత్ర పేరిట ఓ ఐడీ పంపుతారు. 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఈ డీజీ సమాచారంతో ఎలాంటి ఆలస్యం లేకుండా ఎయిర్ పోర్టుల్లో చెక్-ఇన్ పూర్తి చేసుకోవచ్చు.
#DigiYatra to be implemented at Kolkata, Pune, Vijayawada and Hyderabad Airports by March 2023https://t.co/lcM0DSZmRX
— All India Radio News (@airnewsalerts) February 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 03, 2023 10:20 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

