Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా

తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.

Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా
India Women's Kho Kho team celebrate a win at Kho Kho World Cup 2025 (Photo credit: X @Kkwcindia)

తొలి ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది.ఈ విజయంతో తొలి ఖోఖో ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.

ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్‌, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్‌ భారత్‌ సొంతం

కీలకమైన ఫైనల్లో టాస్‌ గెలిచిన నేపాల్‌.. ముందుగా భారత్‌ ను అటాక్‌ రమ్మని ఆహ్వానించింది. ఇది ఆతిథ్య భారత్‌కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్‌కు శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన భారత జట్టు. నేపాల్‌ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా భారత్‌ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది. చివరి దాకా ఇదే ఆట తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 20, 2025 11:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).