Rajasthan: పట్టపగలే పండ్ల వ్యాపారిపై ఆరుగురు యువకులు కాల్పులు, తృటిలో తప్పించుకున్న వ్యాపారి కైలాష్ మీనా, రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో ఘటన, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు
రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్పై వచ్చిన దుండగులు తుపాకులతో పండ్ల వ్యాపారి కైలాష్ మీనాపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన 38 సెకన్ల వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది.
రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్పై వచ్చిన దుండగులు తుపాకులతో పండ్ల వ్యాపారి కైలాష్ మీనాపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన 38 సెకన్ల వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు.
మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
#WATCH | Rajasthan: 6 bike-borne men fired bullets at a shop in the fruits & vegetable market in Gumanpura of Kota y'day. Shop's owner was present inside at the time of incident, he's unhurt.
Police say, "CCTV footage is being examined & efforts being made to arrest the accused" pic.twitter.com/JsKzhytfC8
— ANI (@ANI) June 15, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 15, 2021 07:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

