9,900 Crore in UP Man Account: పొరపాటున యూపీ వాసి ఖాతాలో 9,900 కోట్లు జమ.. మరి ఆ ఖాతాదారుడు ఏం చేశాడంటే?
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాదోహి వాసి భాను ప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాలో రూ. 9,900 కోట్ల రూపాయలు జమవ్వడం చూసి షాక్ తిన్నాడు.
Lucknow, May 20: యూపీలో (Uttarpradesh) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బాదోహి వాసి భాను ప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాలో (Bank Account) రూ. 9,900 కోట్ల రూపాయలు జమవ్వడం చూసి షాక్ తిన్నాడు. వెంటనే తన ఖాతా ఉన్న బరోడా యూపీ బ్యాంక్ కు వెళ్లి అధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. వారు కూడా అతని ఖాతాను పరిశీలించగా రూ.99, 99,94,95,999.99 నిల్వ ఉండటాన్ని గుర్తించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మొత్తం అతని ఖాతాలో పడినట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా అతని ఖాతాను స్తంభింప చేసి తప్పును సవరించారు. సకాలంలో దీని గురించి తమకు తెలియజేసిన ఖాతాదారుడు భానుప్రకాశ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
#UP #man gets Rs 9,900 crore #credited into his #bankaccount Why it happened https://t.co/wxpDlU9jkn
— Headline Karnataka (@hknewsonline) May 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2024 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

