Newdelhi, Dec 12: న్యూఢిల్లీలో (Delhi) మెట్రో రైలు ట్రాక్‌ (Metro Track) పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్‌ మెట్రో స్టేషన్‌ (Shadipur Metro Station) నుంచి ట్రాక్‌ పైకి ఓ యువతి వచ్చింది. చేతిలో మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని ట్రాక్‌ రేలింగ్‌ పై కాలు పెట్టి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనుకుంది. అయితే కింది నుంచి వెళ్తున్నవారు ఆమెను గమనించి వారించారు. దీంతో ఆమెను మాటల్లో పెట్టిన అధికారులు.. పోలీసులను ఆమె వద్దకు పంపించారు. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు, మెట్రో సిబ్బంది ఆ యువతిని క్షేమంగా కిందికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)