Andhra Pradesh: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం, వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఏపీలోని రెండు జిల్లాలు కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేగింది. నగరంలోని ఓ వైన్ షాప్లో ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసి దొంగ నోట్లు ఇచ్చాడు. షాపు యజమాని గమనించి చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ పుటేజ్లను పరిశీలిస్తున్నారు.
ఇక ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ కలకలం రేగింది. టాయ్ క్యాష్తో దుండగులు మోసానికి యత్నించారు. రూ. 2.50 లక్షలకు రూ. 15 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదుర్చుకుని, డబ్బు చేతులు మారుతున్న సమయంలో నకిలీ కరెన్సీకి బదులు టాయ్ క్యాష్ ఇస్తున్నట్లుగా ఓ బాధితుడు గుర్తించాడు. పారిపోవడానికి యత్నించిన దుండగులలో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Fake Currency Notes Caught in Two Districts in Andhra
మచిలీపట్నంలో ఫేక్ కరెన్సీ కలకలం..
ఓ వైన్ షాపులో రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితుడి నంచి రూ.6500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన చిలకలపూడి సీఐ pic.twitter.com/UrWbKY4NDi
— Swathi Reddy (@Swathireddytdp) December 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

