అనకాపల్లి జిల్లా,చోడవరం మండలం అడ్డూరు గ్రామంలోదారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తా మామలపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లుడు మామిడి పైడినాయుడు, అత్త సానబోయిన లక్ష్మి , మామ పైడిరాజుల మధ్య గత కొంతకాలంగా కుటుంబం కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై కక్ష పెంచుకున్న అల్లుడు సోమవారం రాత్రి అత్త,మావయ్య లపై కత్తి తో దాడీ చేశాడు.  మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

ఈ దాడిలో అత్త మృతి చెందింది.మావయ్య కు తీవ్ర గాయాలవగా , స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2020లో చోడవరంలో అల్లుడు పైడినాయుడుపై ప్రేమ వ్యవహారంలో పోక్సో కేసు నమోదయింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)