ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ(KL University) యాజమాన్యం నిర్వాకం బయటపడింది. రేటింగ్ కోసం లంచాలు(Bribery for Ratings) ఇచ్చినట్లు గుర్తించగా NAAC సభ్యులతో సహా 10 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ రేటింగ్ కోసం భారీగా ముడుపులు అప్పజెప్పారు. NAAC పరిశీలన బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు లంచంగా ఇచ్చినట్లు గుర్తించింది సీబీఐ(CBI).
ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సీబీఐ సోదాలు(CBI Rides) నిర్వహించగా సీబీఐ సోదాల్లో రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్ టాప్ లు, ఒక ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీకి చెందిన జేపీ సారథి వర్మ, కోనేరు రాజా, ఏ.రామకృష్ణతో పాటు NAAC పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్ర నాథ్ సాహా, పలువురు కమిటీ సభ్యులను అరెస్టు చేసింది సీబీఐ. వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. మూడు గంటలపాటు చర్చ.. అసలేం జరుగుతుంది??
Bribery for KL University Ratings: 10 Arrested, Including NAAC Members
రేటింగ్ కోసం లంచాలు.. NAAC సభ్యులతో సహా 10 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరంలోని కేఎల్ ఈఎఫ్ యూనివర్సిటీ రేటింగ్ కోసం భారీగా ముడుపులు
NAAC పరిశీలన బృందానికి బంగారు నాణేలు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు లంచంగా ఇచ్చినట్లు గుర్తించిన సీబీఐ
ఢిల్లీ సహా… pic.twitter.com/KMDqlViqaA
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)