NTR Coin: నేటి నుంచి అందుబాటులోకి రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతో తెలుసా?
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.
Hyderabad, Aug 29: ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ స్మారక నాణేం హైదరాబాద్లోని మింట్లో తయారైంది. తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని హైదరాబాద్లోని మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు తెలిపారు. ఆన్లైన్ ద్వారా, హైదరాబాద్లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు.ఇదిలా ఉండగా, ఈ కాయిన్ను నేటి ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు.
Commemorative 100 Rupee Coin On Legendary 𝐒𝐡𝐫𝐢 𝐍.𝐓.𝐑𝐚𝐦𝐚 𝐑𝐚𝐨 Garu.
Tomorrow 10 Am Onwards Coin Will Be Available For Purchase.
Cost 4,050 - 4,850
Link :- https://t.co/pqIff68ela#NTR #JoharNTR #NTRCentenaryCelebrations pic.twitter.com/tip1blosAO
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) August 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 29, 2023 09:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

