హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం, మొన్నటి వరకూ సీపీగా కొనసాగిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు పర్సనల్‌ ఏడీజీగా ఉన్న విజయ్‌ కుమార్‌ను ఏసీబీ ఏడీజీగా, ఆయన స్థానంలో లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ మహేశ్‌ భగవత్‌ను నియమించింది. ఇక పోలీస్‌ స్పోర్ట్స్‌ ఐజీగా ఎం రమేశ్‌కు సైతం అదనపు బాధ్యతలు అప్పగించింది.

జగద్గిరిగుట్టలో మహిళా దొంగల ముఠా అరెస్ట్, నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు, కస్టమర్లలాగ వచ్చి దోపిడి

హైదరాబాద్ కమిషనర్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబీ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తా. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై సీరియస్‌గా ఉంది. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)