2024 భారతదేశం ఎన్నికలు: సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫైట్ సెగలు రేపుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను మాధవీ లత తిప్పికొట్టారు. ముస్లీం, హిందువులు అందరికీ కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గాల్లో బాణం వదిలితే.. దాన్ని మసీదు వైపు విడిచినట్లు వీడియోలో చూపిస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపొద్దంటూ అసద్‌పై మాధవీ లత ఫైర్‌ అయ్యారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య ఫైట్ తో హైదరాబాద్ నియోజకవర్గం సెగలు రేపుతోంది. రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, క‌డియం శ్రీహ‌రికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)