India's Squad For T20I Series Against Bangladesh Announced: బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ టీమ్ లో తెలుగు కుర్రాడికి ఛాన్స్, హైదరాబాద్ వేదికగా మూడో టీ 20 మ్యాచ్, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఇదే!
బంగ్లాదేశ్ లో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది (India's Squad For T20I Series) బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) నేతృత్వంలోని 15 మంది సభ్యుల పేర్లను ఖరారు చేసింది.
New Delhi, SEP 28: బంగ్లాదేశ్ లో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది (India's Squad For T20I Series) బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) నేతృత్వంలోని 15 మంది సభ్యుల పేర్లను ఖరారు చేసింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, హార్డిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితిష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ (Mayank Yadav) ఉన్నారు.
Here's the full Team
NEWS 🚨 - #TeamIndia’s squad for T20I series against Bangladesh announced.
More details here - https://t.co/7OJdTgkU5q #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/DOyz5XGMs5
— BCCI (@BCCI) September 28, 2024
తెలుగు కుర్రారు నితీష్ కుమార్ రెడ్డికి టీ 20 చోటు దక్కడం విశేషం. బంగ్లాదేశ్ లో మొత్తం 3 టీ 20 మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. అక్టోబర్ 6న తొలి మ్యాచ్ ఉండగా, అక్టోబర్ 9 న రెండో టీ20, అక్టోబర్ 12న మూడో టీ 20 ఉంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగనుంది. తొలి మ్యాచ్ గ్వాలియర్ లో , రెండో టీ 20 న్యూ ఢిల్లీలో నిర్వహిస్తారు.
(The above story first appeared on LatestLY on Sep 28, 2024 10:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

