ICC World Cup 2023: వీడియో ఇదిగో, ఏడు సంవత్సరాల తరువాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీం, న్యూజీలాండ్తో వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న దాయాది జట్టు
ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి విదితమే. న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
- Read in
- తెలుగు
ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి విదితమే. న్యూజిలాండ్తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది. సెప్టెంబర్ 29న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ ఉదయం, బృందం లాహోర్ విమానాశ్రయం నుండి ప్రైవేట్ అంతర్జాతీయ విమానయాన విమానంలో బయలుదేరి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది.18 మంది ఆటగాళ్లతో పాటు 13 మంది అధికారులు కూడా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో, 2023 వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ నెదర్లాండ్స్తో అక్టోబర్ 6న, ఆ తర్వాత అక్టోబర్ 10న శ్రీలంకతో మ్యాచ్ ఆడనుంది.

Here's Video
Pakistani team have landed in Hyderabad for the 2023 World Cup.
First India tour in 7 years for Pakistan! pic.twitter.com/tFf0QM5hXi
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 27, 2023 09:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

