AP Govt Agreement with EDX: మన పోటీ దేశంతో కాదు ప్రపంచంతో.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందించే ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.
Vjy, Feb 16: ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో జగన్ సర్కారు ఒప్పందం (AP Govt Agreement with EDX) చేసుకుంది. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది.
ఇప్పటికే ఎడెక్స్ (e-learning platform EDX), ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. తద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా ఈ కోర్సు ప్రోత్సహిస్తోంది.
ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు.ఒప్పందం అనంతరం సీఎం మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం.నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని అన్నారు. ఈ దేశంలో ఉన్నవారితో కాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. మంచి మంచి జీతాలు సంపాదించాలి. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అని సీఎం జగన్ తెలిపారు.
మనం వేసిన ప్రతి అడుగులో ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి, మన ప్రాధమిక విద్య స్ధాయి నుంచి సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. మానవవనరులమీద పెట్టుబడి అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మన ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకితభావం చూపిస్తున్నాం. ప్రాధమికస్ధాయి నుంచి విద్యలో జరుగుతున్న మార్పులు గమనిస్తే... అక్కడ నుంచే అడుగులు పడుతున్నాయి. మొట్టమొదటిసారిగా ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేశాం. గ్లోబల్ సిటిజెన్స్ కావాలంటే మనం మాట్లాడే భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్ధాయితో పోటీపడాలి. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదని తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిషు మీడియం చేయడం నుంచి మొదలు, నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చడం, పిల్లలను బడులకు తీసుకువచ్చే కార్యక్రమానికి స్ఫూర్తి కోసం అమ్మఒడి, గోరుముద్దతో మొదలు పెట్టాం. ఇంగ్లిషు మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా రానున్న పది సంవత్సరాలకు.. ఇవాళ ఒకటో తరగతి చదువుతున్న పిల్లవాడు పదోతరగతికి వచ్చేసరికి ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) విద్యావిధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
Here's AP CMO Tweets
ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం. నేడు సీఎం శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం.
1/2#edX#eLearning #CMYSJagan #AP pic.twitter.com/T51G4WSpkQ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2024
ఎడ్క్స్తో ఈరోజు చేసుకుంటున్న ఒప్పందం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంఐటీ, ఎల్ఎస్ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత యూనివర్సిటీల కోర్సులు కూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు.
- సీఎం#edX#CMYSJagan#AP pic.twitter.com/nFgBY4uPch
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2024
మన యూనివర్సిటీలలో అందుబాటులో లేని AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్, రియల్ ఎస్టేట్ మేనేజిమెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్సేంజ్, వెల్త్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఇప్పుడు మన కరిక్యులమ్లో భాగమౌతున్నాయి.
- సీఎం #edX#CMYSJagan#AP pic.twitter.com/PKANSzbjCd
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2024
కనీసం రూ.30వేలు ఖర్చు అయ్యే ప్రీమియం edX కోర్సులను సామాన్యులకు కూడా ఉచితంగా అందించి, వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీల్లో చదివే అవకాశం కల్పిస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు.
- హరిత, బీటెక్, జేఎన్టీయూ, అనంతపురం#edX#CMYSJagan#AP pic.twitter.com/QiQqWyoJdl
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2024
బీటెక్ వాళ్లతో సమానంగా అండర్ గ్రాడ్యుయేట్స్కి కూడా మీరు ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టడం మాకు ఎంతో హెల్ప్ అయ్యింది. ఇంటర్న్షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు విద్యార్థులనే వెతుక్కుని వచ్చేలా చేసారు.
- అంజలి, బీకాం, మేరీ స్టెల్లా కాలేజ్, విజయవాడ#edX#CMYSJagan#AP pic.twitter.com/FL0QCxp62H
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 16, 2024
ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నాం. 2035 నాటికి ఏకంగా మన పిల్లలు ఐబీలో పరీక్షలు రాసే స్ధాయికి మన పిల్లల చదువులను తీసుకునిపోతారని తెలిపారు.6వతరగతి నుంచి ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేస్తూ... ఐఎఫ్బీలను ప్రతి క్లాస్రూంలలో ఏర్పాటు చేస్తున్నాం. 8వతరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి, పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ సులభంగా అర్ధం అయ్యేలా చేస్తున్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగువల్ టెక్ట్స్బుక్స్ ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగులో ప్రతి ప్రభుత్వ స్కూళ్లో అందుబాటులోకి తెచ్చామన్నారు.
తొలిసారిగా 400 పైగా బైలింగువల్ పాడ్క్యాస్టులు తీసుకువచ్చాం. రాష్ట్రంలో 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్ధలు మాత్రమే న్యాక్ గుర్తింపు పొందగా.. ఈ రోజు రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధలు 437 ఉన్నాయి. ప్రతి అడుగులో విద్యలో నాణ్యత పెంచాలి.. అలా పెంచగలిగితే మన పిల్లలు ప్రపంచంతో పోటీపడతారని ప్రతి అడుగు వేశామన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3డి లెర్నింగ్ వంటి వాటిని మన కరిక్యులమ్లో అందుబాటులోకి తీసుకునిరావాలి. అలా తేగలిగితేనే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేగలుగుతామని సీఎం తెలిపారు.
మన పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అందించగలిగితేనే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్ద, పెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 400 మందికి పైగా ఇప్పటికే వినియోగించుకున్నారని సీఎం తెలిపారు.
(The above story first appeared on LatestLY on Feb 16, 2024 06:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

