Rayapati Sambasiva Rao: వచ్చే ఎన్నికల్లో టీడీపీ 125కు పైగా సీట్లు గెలుస్తుంది, సంచలన జోస్యం చెప్పిన మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు
Rayapati Sambasiva Rao (Photo-Video Grab)

Guntur, Sep 30: ఏపీలో 2024లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ నేత‌, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీదే విజ‌య‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే 125కు పైగా స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తుల విష‌యంలో అంతిమ నిర్ణ‌యం చంద్ర‌బాబుదేన‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు.

ఆయుష్మాన్ భార‌త్‌లో ఏపీకి ఆరు అవార్డులు, ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని రాష్ట్రంలో మెరుగైన రీతిలో అమ‌లు చేసిన తీరుకు అవార్డులు ప్రకటించిన కేంద్రం

గుంటూరు ఉమ్మ‌డి జిల్లా టీడీపీ నేత‌ల‌తో శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ఉమ్మ‌డి జిల్లా యూనిట్‌గా నేత‌లంతా స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ స‌మావేశానికి హాజ‌రైన రాయ‌పాటి.. మీడియాతో మాట్టాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలా? వ‌ద్దా? అన్న విష‌యంపై తాను ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు. అంతేకాకుండా ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయాలో, వ‌ద్దో చంద్ర‌బాబే నిర్ణ‌యిస్తార‌ని కూడా ఆయ‌న తెలిపారు.