Central Govt Committee: ఏపీలో వ‌ర‌ద‌ల‌పై సాయానికి సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, రేపు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర క‌మిటీ, అమిత్ షా ట్వీట్

విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) తెలిపారు.

Central Govt Committee: ఏపీలో వ‌ర‌ద‌ల‌పై సాయానికి సిద్ధ‌మైన కేంద్ర ప్ర‌భుత్వం, రేపు వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర క‌మిటీ, అమిత్ షా ట్వీట్
Vijayawada Budameru River Flood is increasing again (photo/Video grab/BigTV)

Vijayawada, SEP 04: విజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amith Shah) తెలిపారు. కాగా, అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా.. ‘విజయవాడ ముంపు (Vijayawada Flood), వరదలపై కేంద్ర కమిటీ నియామకం. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ నేతృత్వంలో నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది.

Here's Tweet

 

ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో ఈ కమిటీ పర్యటిస్తుంది. వరద నష్టం, వరద నివారణ, డ్యామ్‌ల భద్రతపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం కమిటీ ఏపీకి రానున్నట్టు సమాచారం.

YS Jagan Comments on Chandrababu: క‌ర‌కట్ట ద‌గ్గ‌ర‌ ఇళ్లు మునిగింది కాబ‌ట్టే..చంద్ర‌బాబు క‌లెక్ట‌రేట్ లో ఉంటున్నారు! సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన వైఎస్ జ‌గ‌న్  

మ‌రోవైపు నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడూ ఇంత ఉదృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. బుడమేరు వరద ఉధృతి కారణంగా పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చోచ్చుకు వచ్చింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరిపిరాలలో అత్యంత ప్రమాదకర స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. Central Govt Committee

(The above story first appeared on LatestLY on Sep 04, 2024 09:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).