KCR Key Comments: అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా! రాజకీయ కక్షతోనే నా కుమార్తెను జైల్లో పెట్టారు, బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ (BRSLP) సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.
Hyderabad, July 23: మండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే నా కుమార్తెను జైలులోపెట్టారట్టాని ఆరోపించారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అంటూ ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితులు ఏమీ లేని.. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణను సాధించామని స్పష్టం చేశారు. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే బాగా ఎదుగుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని.. పాలనపై దృష్టి పెట్టకుండా అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో ప్రారంభమైన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం. pic.twitter.com/x4kKgPsBNc
— BRS Party (@BRSparty) July 23, 2024
శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని నిలదీశారు. ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని.. పార్టీ వదిలి వెళ్లేవారిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 23, 2024 09:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

