Temperatures Increase In Telangana: ఎండాకాలం వచ్చేసినట్లేనా? తెలంగాణలో గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో గతం కంటే 6 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది
Hyderabad, FEB 02: తెలంగాణ వ్యాప్తంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) గణనీయంగా పెరిగాయి. అన్ని జిల్లాల్లో 30 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే అన్ని జిల్లాల్లో 2 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో 36.5, భధ్రాద్రి-కొత్తగూడెంలో 35.6, హనుమకొండ, హైదరాబాద్లో 34 డిగ్రీలు నమోదయ్యాయి.
ఖమ్మంలో 34.6, మహబూబ్నగర్ 36.1,మెదక్ 34.8, నల్లగొండలో 31.5, నిజామాబాద్లో 34.5, రామగుండంలో 34 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే వారం రోజులు ఇదే వాతావరణం (Weather) ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Feb 02, 2025 09:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

